మార్కెట్లకు లాభాల బోణీ

మార్కెట్లకు లాభాల బోణీ

ముంబై: దేశీయ మార్కెట్ల ట్రేడింగ్ సోమ వారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:16 గంటలకుసెన్సెక్స్‌ 296.45 పాయింట్లు లాభపడి 39,912.35 వద్ద, నిఫ్టీ 86.10 పాయింట్లు బలపడి 11,956.80 వద్ద ట్రేడయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.23 వద్ద దాఖలైంది. బంగారం ధర రూ.149 పెరిగి రూ. 32,949( పది గ్రాములు) లకు చేరుకుంది. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, వేదాంత, టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్, యస్‌ బ్యాంకు, ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, డీఎఫ్‌హెచ్‌ఎల్‌, ఎడెల్‌వీస్‌ ఫినాన్షియల్‌, మనప్పురం ఫినాన్స్‌, ఇండియా సిమెంట్స్‌ లాభాల్ని గడించాయి. జె అండ్‌ కె బ్యాంకు, రియలన్స్‌ పవర్‌, రిలయన్స్‌ క్యాపిటల్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, పీసీ జువెలర్స్‌ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos