లాభాల విపణి

లాభాల విపణి

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందనే వార్తలు, జో బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు ట్రంప్ మార్గం సుగమం చేయటం ఇందుకు కారణం. నిఫ్టీ చరిత్రలో తొలిసారి 13 వేల మార్కును అధిగమించింది. బీ ఎస్ ఈ సెన్సెక్స్ 446 పాయింట్లు ఎగబాకి 44,523 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు లాభపడి 13,055 వద్ద ఆగాయి. టెలికాం మినహా అన్ని సూచీలు లాభాలు మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్ (4.02%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.14%), ఐటీసీ (2.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.16%) లాభ పడ్డాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.47%), టైటాన్ కంపెనీ (-1.36%), నెస్లే ఇండియా (-0.63%), భారతి ఎయిర్ టెల్ (-0.61%), ఓఎన్జీసీ (-0.59%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos