ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. పది గంటల ప్రాంతంలో బీఎస్ఇ సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 36 వేల 787 వద్ద, ఎన్ఎస్ఇ 36 పాయింట్లు వృద్ధి చెంది 10 వేల 836 వద్ద ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, యూపీఎల్, టాటాస్టీల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాలిన గడించాయి. ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, ఆల్ట్రాటెక్ సిమెంట్ నష్ట పోయాయి.