ప్రియాంక వ్యాఖ్యకు ఖాకీల స్పందన

ప్రియాంక వ్యాఖ్యకు ఖాకీల స్పందన

లక్నో: ఉత్తర ప్రదేశ్ నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యకు పోలీసులు గణాంకాలతో బదులిచ్చారు. ‘తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్నాం. రెండేళ్లలో 9225 మంది నిందితుల్ని అరెస్టు చేసాం. మరో 81 మంది నిందితులు మరణించారు. జాతీయ భద్రతా చట్టం కింద దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాం. దోపిడీ, హత్యలు, అపరణలు గణనీయంగా తగ్గాయి’ అని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘ఉత్తర ప్రదేశ్లోని నేరగాళ్లంతా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ, తమకేం కావాలంటే అది చేస్తున్నారు. నేరాలు నిరాటంకంగా జరుగుతున్న భాజపా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. నేరగాళ్ల ముందు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మోకరిల్లిందా?’’ అని ప్రియాంక ట్వీట్లో ప్రశ్నించారు. గత వారం కూడా ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్లో మహిళలకు, బాలికలకు రక్షణ కరువైందంటూ విరుచుకుపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos