పారితోషికాలు ఎగ్గొడుతున్న నిర్మాతలు

పారితోషికాలు ఎగ్గొడుతున్న నిర్మాతలు

చెన్నై: చాలా మంది నిర్మాతలు కథానాయికలకు పారి తోషికాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కథా నాయిక ప్రియమణి విమర్శించారు. బాధితుల్నిఆదుకునేందుకు ఎక్కువ పారితోషికాన్ని తీసుకుంటున్న కథనాయికలు ముందుకు రావాలని విన్నవించారు. ‘దక్షిణాదిలో కథానాయికలకు వారి ప్రతిభకు తగిన పారితోషికాలు అందడం లేదు. నయనతార, అనుష్క , సమంత వంటి కొందరికే భారీగా పారితోషికాలు అందుతున్నాయి. సరైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. మధ్యతరగతి కథానాయికల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికి ఇస్తున్న పారితోషికాలు చాలా తక్కువ. చాలామందికి కనీస పారితోషికం కూడా అందడం లేదు. ముందుగా ఇస్తామన్న పారితోషికాలు కూడా ఇవ్వకుండా తమచుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారి విషయంలో స్టార్ హీరోలు .. హీరోయిన్స్ స్పందించవలసిన అవసరం ఉంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos