న్యూ ఢిల్లీ : ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పటి వరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామ’ని ఇక్కడి పదాతి దళ ఆస్పత్రి శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. గత పదిన ఆయన మెదడులో ఏర్పడిన కణితిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. కరోనా చికిత్సకు ఆయన ఆ ఆస్పత్రిలో చేరారు.