చిరంజీవి ఫోన్‌ చేసి మరీ ఏడ్చాడు..

చిరంజీవి ఫోన్‌ చేసి మరీ ఏడ్చాడు..

ఏ అంశం గురించైనా ప్రత్యర్థులతో చెడుగుడు ఆడుకునే రచయిత-దర్శకుడు-నటుడు
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం వైసీపీ తరపున ప్రచారాలు చేస్తూ ప్రత్యర్థ పార్టీలపై ఒక
రేంజులో విరుచుకుపడుతున్నారు.తెదేపా అధినేత చంద్రబాబుపై పరుష పదజాలాలతో విరుకుపడ్డ
పోసాని తాజాగా తన దృష్టిని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సారించారు.కొద్ది రోజుల క్రితం
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను
తెలంగాణలో కొడుతున్నారంటూ పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని మండిపడ్డారు.నీ రాజకీయ
స్వార్థం కోసం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దని హైదరాబాద్‌లో
రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలసిమెలసి సంతోషంగా ఉంటున్నారన్నారు.ఇదే క్రమంలో
ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రస్తావించిన పోసాని ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవికి
పవన్‌ కళ్యాణ్‌ మోసం చేశాడని ఆరోపించారు.అప్పటి రాజకీయాల్లో ముందుకు రాలేక ప్రజారాజ్యం
విఫలమైతే పార్టీని మధ్యలోనే వదిలేసిన వ్యక్తుల్లో పవన్‌ ముందున్నాడని యువరాజ్యం బాధ్యతల
నుంచి తప్పుకొని పవన్‌ చిరంజీవిని మోసం చేశాడని ఆరోపించారు.పవన్‌ కళ్యాణ్‌ బాటలోనే
చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూడా నడిచారని ఇలా ఎంతమంది ప్రజారాజ్యం వీడినా తాను
మాత్రం ప్రజారాజ్యం చివరి అంకం వరకు ఉన్నానన్నారు.ప్రజారాజ్యం ఫెయిల్ అయిన సందర్భంగా చిరంజీవి ఎంతో మధన పడ్డాడని.. తనను – తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తట్టుకోలేక చిరంజీవి తనకు ఫోన్ చేసి ఏడ్చాడని.. ఇందుకు సాక్ష్యం మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అంటూ పోసాని సంచలన నిజాన్ని బయటపెట్టాడు. సొంత అన్నయ్యను మధ్యలో వదిలేసిన పవన్ వైఖరి ఇది అంటూ విమర్శలు గుప్పించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos