పాట్నా : నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విపక్ష నేత తేజస్వీ యాదవ్ మండి పడ్డారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 30 లక్షల మంది వలస కార్మికులు బిహార్కు చేరుకున్నారు. వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉపాధి కల్పనకు ఇప్పటి వరకూ తీసుకున్న మార్గ నిర్దేశకాలు వెల్లడించాల’ని డిమాండ్ చేశారు. వారికి కల్పించిన ఉపాధి వివరాల్ని ప్రాంతాల వారీగా వివరించాల’ని డిమాండు చేసారు.