పూనపల్లిలో అన్నదాతలు

పూనపల్లిలో అన్నదాతలు

హొసూరు : కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని పూనపల్లి గ్రామం లో గత నెల రోజులుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాన్నిగ్రామస్తులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా పరిశ్రమలు మూతపడ్డాయి. అందులో భాగంగా హొసూరు పారిశ్రామిక వాడలోని అన్ని పరిశ్రమలు మూతపడటంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు భోజనాలకు ఇబ్బంది పడుతుండడం అందరికీ తెలిసిన విషయమే. పూనపల్లి ప్రాంతంలో కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో ఆ పరిశ్రమలలో వేల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలో మూతపడడంతో వలస కార్మికులు రోడ్డున పడ్డారు. సరైన సమయానికి యాజమాన్యాలు కూడా ఆదుకోక కాకపోవడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా పూనపల్లి గ్రామస్తులు వారి ఆకలి తీర్చేందుకు రో జూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏడీఎంకే పార్టీ నాయకుడు హరీష్ రెడ్డి, గ్రామస్తులు ముందుకు వచ్చి వలస కార్మికులకు భోజనాన్ని వండి పెడుతున్నారు. గత నెల రోజులుగా వలస కార్మికులను పూనపల్లి గ్రామస్తులు ఆదుకోవడమే కాక వారికి నిత్యావసర వస్తువులను కూడా అందిస్తూ ఉదారతను చాటుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos