ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్పై మండిపడ్డారు. వినియోగదారుల సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదని, పదే పదే సమస్య వస్తోందని తెలిపింది.ఎయిర్టెల్ నుంచి ఇతర టెలీకాం సంస్థకు చెందిన సిమ్ వాడి సమయాన్ని సేవ్ చేసుకోవాలని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులకు చెప్పింది. పూజా లాంటి సెలబ్రిటీ కన్నెర్ర జేస్తే ఎయిర్ టెల్ లాంటి కంపెనీ మాత్రం ఏం చేస్తుంది? పూజా హెగ్డేకు ఎదురవుతోన్న తమ సర్వీసు సమస్యలన్నీ పరిష్కరించారు.’హాయ్ పూజా.. మీకు కలిగిన సేవల అంతరాయం పట్ల క్షమాపణలు చెబుతున్నాం. మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందని భావిస్తున్నాం‘ అని ఎయిర్టెల్ ఇండియా తెలిపింది. దీంతో్ పూజా హెగ్డే శాంతించారు. అయితే, ఈ ట్వీట్స్ వార్ గమనిస్తోన్న చాలా మంది నెటిజన్స్ ఎయిర్ టెల్పై ఇంకా గుస్సాగానే ఉన్నారు. ”పూజా హెగ్డే సెలబ్రిటీ కాబట్టి వెంటనే స్పందించారు. మామూలు వాళ్లని మీరు అదే రీతిన పట్టించుకుంటారా?” అని విమర్శలు చేస్తున్నారు..