ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాదు

ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాదు

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతలు కూడా తెలియవు. పన్నుల వసూలు పెరిగిందని బల్లలు చర్చడం సిగ్గుచేటు. పేద ప్రజల మీద భారం తగ్గించడానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలి. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉంది. అందుకే ముఖ్యంత్రి గిల గిలా కొట్టు కుంటు న్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపే దమ్ము ఉందా? అమెరికా, చైనా ఆర్థిక వృద్ధిరేటు ఎంత?.. భారత్ వృద్ధిరేటు ఎంత? ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాద న్నారు. పీఎం మోదీ నిన్న యూపీలో మాట్లాడిన మాటలు ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయి. దేశ అప్పులు 232.8 బిలియన్ డాలర్ల నుంచి 1626 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఏడింతల అప్పులు పెంచి దేశాన్ని దివాళా తీయించార’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos