కేసీఆర్‌కు పార్శిల్ వచ్చిన సీసాల్లో ఉన్నదేంటంటే..

కేసీఆర్‌కు పార్శిల్ వచ్చిన సీసాల్లో ఉన్నదేంటంటే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులకు,ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులకు, ప్రముఖులకు ఈ నెల 17వ తేదీన పార్శిల్‌లో వచ్చిన సీసాల్లో ఉన్నది మురికినీరుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సిబ్బంది ప్రాథమికంగా స్పష్టం చేశారు.ఈ నెల 17 తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను అజ్ఞాత వ్యక్తి  బుక్ చేశాడు.    కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా  గుర్తించారు.. అంతేకాదు   బాటిల్స్ నుండి దుర్వాసన వస్తోంది. విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. బాటిళ్లలో ఉన్న ద్రవాన్ని పూర్తిగా పరిశోధించిన ల్యాబ్‌ సిబ్బంది మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చారు.ఓయూ లో మురుగరు నీరునే తాము తాగుతున్నామని వారు బాటిల్స్ నిండా నింపి పంపారు. బాటిల్స్ తో పాటు లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మురుగు నీరే తాము తాగుతున్నామని లేఖలో పేర్కొన్నారు. విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే లేఖ ఎవరు రాశారు. బాటిల్స్ ఎవరు పంపారనే  విషయమై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos