తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులకు,ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు, ప్రముఖులకు ఈ నెల 17వ తేదీన పార్శిల్లో వచ్చిన సీసాల్లో ఉన్నది మురికినీరుగా ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది ప్రాథమికంగా స్పష్టం చేశారు.ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి బుక్ చేశాడు. ఈ కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా గుర్తించారు.. అంతేకాదు ఈ బాటిల్స్ నుండి దుర్వాసన వస్తోంది.ఈ విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. బాటిళ్లలో ఉన్న ద్రవాన్ని పూర్తిగా పరిశోధించిన ల్యాబ్ సిబ్బంది మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చారు.ఓయూ లో మురుగరు నీరునే తాము తాగుతున్నామని వారు ఈ బాటిల్స్ నిండా నింపి పంపారు.ఈ బాటిల్స్ తో పాటు ఓ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మురుగు నీరే తాము తాగుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ లేఖ ఎవరు రాశారు.ఈ బాటిల్స్ ఎవరు పంపారనే విషయమై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు..