పోలీసును కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

పోలీసును కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునిల్ కాంబ్లే ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. శనివారం ఈ ఘటన జరిగింది. ససూన్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే సభా వేదిక నుంచి వెళ్లిపోతూ పోలీసు చెంప చెళ్లు మనిపించారు. ఆ సభా వేదికపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నారు. పోలీసును కొట్టిన ఎమ్మెల్యే సునిల్పై కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసుపై చేయిచేసుకున్నట్లు ఆ కేసులో ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు బుక్ చేశారు. పుణెలోని బుంద్గార్డెన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos