అమరావతి : విద్యుత్ బస్సుల కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీర్మానించినట్లు అధికార వర్గా లు శుక్రవారం ఇక్కడ తెలిపాయి. విద్యుత్ బస్సల కొనుగోలు, సాంకేతికత, ఆర్థిక వెసలు బాటు తదితర అంశాలపై అధ్యయనానికి వైకాపా ప్రభుత్వం నియమించిన నిపుణుల సమితి తన నివేదికను శుక్రవారం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అందంచింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అవసరమైన నిధుల్ని సమీకరించు కోవాలని సూచించింది. ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద సోలార్ పవర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. రహదారి రవాణా సంస్థ సముదాయాల కప్పుల్లో సౌర ఫలకాల్ని అమర్చాలనీ సలహా ఇచ్చింది. తిరుమలలో విద్యుత్ బస్సుల్ని నడపాలని, అలిపిరి, తిరుమలలో ఛా ర్జిం గ్ స్టేషన్ల ఏర్పాటుకు భూములు కేటాయించాలని సూచించింది.