హొసూరులో టీటీడీ సమాచార కేంద్రం కావాలి

హొసూరులో టీటీడీ సమాచార కేంద్రం కావాలి

హొసూరు : తమిళనాడులోని పెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన హొసూరులో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ టీటీడీ ధర్మకర్తల మండలికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్‌గా హొసూరు స్థాయి పెరిగిందని, జనాభా ఎక్కువగా ఉందని వివరించారు. నిత్యం ఇక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వందల సంఖ్యలో భక్తులు వెళుతుంటారని తెలిపారు. కనుక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే హొసూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో వసతులను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల బస్సులన్నీ కళ్యాణ మండపం నుంచే బయలుదేరే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కళ్యాణ మండపం భవంతికి కొత్తగా రంగులు వేయించాలని కూడా ఆయన సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos