పాక్‌కు చైనా భరోసా

పాక్‌కు చైనా భరోసా

బీజింగ్: కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్కు అవసరమైన మద్దతు ఇస్తామని చైనా హామీ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ‘ఈ సందర్భంగా కాశ్మీర్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. అతి ముఖ్యమైన అంశాల్లో మద్దతు ఇస్తామ’ని ఇమ్రాన్ ఖాన్కు జిన్పింగ్ భరోసా ఇచ్చినట్లు జిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. జమ్ము-కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత పాక్, భారత్ల మధ్య విభేదాలు పెరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos