ఊరూ వాడా పెరియార్ జయంత్యుత్సవాలు

ఊరూ వాడా పెరియార్ జయంత్యుత్సవాలు

హోసూరు: జాతీయ స్థాయిలో ప్రముఖ హేతువాదిగా పేరొందిన, ద్రవిడ కళగం పార్టీ స్థాపకుడు ఈ.వి.రామస్వామి నాయకర్ ( పెరి యార్) ర 141 వ జయం త్యుత్సవం మంగళవారం ఇక్కడ ఘనంగా జరిగింది. . డీఎంకే ,డీకే పార్టీల నాయకులు పెరియార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. డీఎంకే నాయకుడు హొసూరు మున్సిపల్ మాజీ చైర్మెన్ ఎన్.ఎస్ .మాదేశ్వర తాలూకా కచ్చేరీ రోడ్డులోని అణ్నాదురై విగ్రహం వద్ద పెరియార్ చిత్ర పటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత సమత్వపురంలో పెరియార్ విగ్రహనికి, మునీశ్వర నగర్ వద్ద గల సర్కిల్లో పెరియార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు .తళిఎమ్మెల్యే వై. ప్రకాష్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు .పెరియార్ తమిళ ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా నేత అని ఈ సందర్బంగా కొనియాడారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos