అమరావతి : ముసాయిదాల్ని సభలో హడావుడిగా ప్రవేశ పెట్టారని తెదేపా అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఎగువ సభలో మంత్రులు ఛైర్మన్పై దాడి చేసినంత పని చేశారు. హద్దు టి వస్తే బయటపడేయండని మార్షల్స్ను జగన్ ఆదేశించారు. వైసిపి మంత్రులు చేసిందేమిటి?. పోడియం బల్లలను ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి..? మండలిలో 25మంది మంత్రులు తిష్టవేసి వీరంగం చేశారు. ఎంపి గల్లా జయదేవ్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఇక అమరావతి పరి రక్షణ ప్రజల చేతుల్లోనే ఉంది. జేఏసీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాల’ని పిలుపునిచ్చారు.