చిదంబరంతో కాంగ్రెస్ నేతల భేటీ

చిదంబరంతో కాంగ్రెస్ నేతల భేటీ

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఇక్కడి తీహార్ కారాగారంలో బంధీగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని కాంగ్రెస్ సీని యర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. వారి వెంట చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కశ్మీర్ అంశం, ఆర్థిక మాంద్యం తదితర విషయాలపై దాదాపు అరగంట పాటు వీరు చర్చించినట్లు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడియా కే సు లో గత నెల 21న సీబీఐ అధికారులు చిదంబరాన్ని న్యాయస్థానంలో హాజరు పరచారు. సెప్టెంబరు 5 నుంచి 19 వరకూ న్యాయ స్థానం జుడిషి యల్ కస్టడీకి ఆదేశించింది. బెయిల్ కోసం చేసిన వినతిపై ఈ నెల 23న విచారణ జరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos