న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎర్రగడ్డలకు బదులుగా అవకాడో తింటారాని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎద్దేవా చేసారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్పై విడుదలైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం గురువారం పార్టీ నేత లతో కలిసి పెరుగుతున్న ఉల్లి ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఉల్లిగడ్డ తిననని ఆర్థిక మంత్రి చెప్పారు. దానర్థమేంటీ..? అంటే ఆవిడ అవకాడో తింటారా?’ అని ఎద్దేవాచేశారు.