న్యూ ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై బుధ వారం తొలి ఇ-ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.2007లో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి విదేశీ పెట్టుబడులు భారీగా తరలి వెళ్లడానికి సహకరించారని, దాని నుంచి కార్తి చిదంబరం లబ్ధి పొందారనేది సీబీఐ, ఈడీ ఆరోపణ. పెట్టు బడుల తరలింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయని 2017లో సీబీఐ ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది. నగదు అక్రమ బదిలీ ఆరోపణలతో 2018లో ఈడీ కేసు నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియాకు చెందిన ఇంద్రాణీ ముఖర్జియా, పీటర్ ముఖర్జియాలు కూడా ఈ కేసులో సహ నిందితులు. ఇంద్రాణీ ఆప్రూవర్గా మారారు.