నోరు పారేసుకున్న నటి పాయల్‌ పై కేసు

నోరు పారేసుకున్న నటి పాయల్‌ పై కేసు

జైపూర్: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మోతీలాల్ నెహ్రూ, ఆయన కుమారుడు, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ నటి పాయల్ రోహత్గికి వ్యతిరేకంగా ఇక్కడ పోలీసులు కేసు దాఖలు చేసారు. ఆమెకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేత చర్మేష్ శర్మ చేసిన ఫిర్యాదును అనుసరించి ఐటీ చట్టంలోని సెక్షన్ 66, 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మోతీలాల్ నెహ్రూపై తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రోహత్గి ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. జవహర్ లాల్ నెహ్రూ భార్య వ్యక్తిత్వంపైనా ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ‘మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించి కొన్ని ఫొటోలతో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ గత నెల 21 ఫేస్బుక్లో ఆమె వీడియో పోస్టు చేశారు. ఆ కేసు ఇంకా అలాగే ఉంది. ఇలాంటి పోస్టుల వల్ల ఇతర దేశాలతో భారత్ సంబం బధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆమె పై చర్యలు తీసుకోవాల’ని శర్మ ఫిర్యాదులో కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos