దిశ ఘటనలో నిందితుల ఎన్కౌంటర్పై సినీనటి రేణూదేశాయ్ స్పందించింది.నిందితుల ఎన్కౌంటర్ భావ్యం కాదంటూ హితబోధ చేసింది. పోలీసులు అలా చంపేయడం కరక్టే కానీ అంటూ కొన్ని లాజిక్స్ మాట్లాడింది. ఇలా ఇష్టమొచ్చినట్లు చంపుకుంటూ పోతే ఏం చెప్పాలంటూ ప్రశ్నించింది.ఆ నలుగురు నిందితులు చేసింది క్షమించరాని నేరం.. కాబట్టి వాళ్ళను చంపడం కరెక్టే కానీ అలా చంపడం మాత్రం సరైంది కాదని చెప్పుకొచ్చింది.అదే స్థానంలో మంత్రి కొడుకు ఉంటే ఇలాగే నడిరోడ్డు మీద కాల్చేస్తారా? అంటూ ప్రశ్న లేవనెత్తి సంచలనం సృష్టించింది. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టే ఆలా జరిగింది.. అదే అక్కడ పెద్దోళ్ల కొడుకులు ఉంటే చంపేంత దమ్ము ఎవ్వరికీ ఉండకపోయేదని చెప్పుకొచ్చింది.తప్పు చేసిన ఏ ఒక్కరికైనా కచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ.. పడాల్సిన రీతిలో పడాలని అంటోంది. దేశంలోని అందరికీ ఒకేలా న్యాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెబుతోంది.