మరి రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగనున్ననేపథ్యంలో
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రచారం ముమ్మరం చేసారు.తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించిన
పవన్కళ్యాణ్ గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన సహకారం,బలంతోనే అధికారంలోకి వచ్చిందన్నారు.గత
ఎన్నికల్లో జనసేన సైనికులు 12.5శాతం ఓట్లు తెదేపాకు వేయడంతో తెదేపా అధికారం చేజిక్కించుకుందన్నారు.ఇదంత
విస్మరించిన తెదేపా నేతలు జనసేనకు అంత ప్రభావం లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ
విమర్శించారు.ఒకవేళ జనసేనకు నిజంగా అంత ప్రభావం చూపగలిగే సత్తా లేకపోతే తెదేపా నేతలు
జనసేనను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు.తెదేపా అరాచకాలకు ఎదురు తిరిగామన్న
కారణంగా తెదేపా ప్రభుత్వం జనసేన కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టిందంటూ ఆరోపించారు.జనసేన సైనికులు ఏమైనా సంఘ విద్రోహ శక్తులా? ఎవరిమీదనైనా బాంబులు వేశారా? వేట కొడవళ్లతో నరికారా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. దేశ భక్తి బీజేపీకి మాత్రమే సొంతం కాదని.. బీజేపీ
మాత్రమే దేశాన్ని ప్రేమిస్తున్నట్లు బీజేపీ నేతలు భావిస్తున్నారని..వారి కంటే వంద రెట్లు ఎక్కువగా భరతమాతను తాము ప్రేమిస్తామని పవన్ పేర్కొన్నారు.తన రాజకీయ ప్రత్యర్థుల్ని తాను కలవటం వెనుక కారణాన్ని చెప్పకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఇళ్లకు ఎందుకు వెళ్లారు? అని తనను చాలామంది ప్రశ్నిస్తారని.. తనకు ఎవరితోనూ.. ఎప్పుడూ వ్యక్తిగత ద్వేషాలు అన్నవి లేవన్నారు. సయోధ్యతోనే సమస్యకు పరిష్కారం అవుతుందని తాను భావిస్తానని.. సయోధ్య కుదరని వేళలో మాత్రం తాను యుద్ధం చేస్తానని చెప్పారు. మరి.. బాబు గెలుపు వెనుక జనసేన పాత్రపై లెక్క చెప్పిన పవన్ మాటలకు బాబు సమాధానం చెప్పగలరా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.