అమరావతిలో రాజధాని వద్దన లేదు

అమరావతిలో రాజధాని వద్దన లేదు

అమరావతి: అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం ఇక్కడ స్పష్టీకరించారు. రాజధానిని ఇక్కడ నిర్మించరాదని తాను అన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను ఖండిం చారు. రాజధాని భూ సేకరణను మాత్రమే తాను అప్పట్లో వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. నిడమర్రు, కొండవీటివాగు, దొండపాడు వంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టీకరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే నష్టపోయామన్నారు. రాజధాని బదిలీ వంటి గందరగోళ నిర్ణయాలతో మరింత నష్ట పోతామన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే కఠిన నిర్ణయాల్ని చేయాల్సి వస్తుందని హెచ్చరిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos