ఆంధ్రుల్ని కొడుతున్న తెలంగాణ: పవన్

భీమవరం: తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. భీమవరంలో శాంతి భద్రతల్ని కాపాడుతానని హామీ ఇచ్చారు. ‘నేను నడిచే నాయకుడిని కాదు. ప్రజల సేవకుడిని. ప్రేమతో, సహనంతో దేన్నయినా జయించవచ్చు. అందుకే నేను భీమవరం నుంచి పోటీ చేస్తున్నా. భావజాలంతో రాజకీయం ముడిపడాలి. కులంతో ముడిపడిన రాజకీయం చేయకూడద’ని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos