పాటియాల: నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతు న్నాయి. శనివారం ఉదయం 9:30 నుంచి నుంచి సాయం త్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవ లను నిషేధించారు. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మకూడదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. వాస్తవాలేంటో తామే చెప్తామన్నారు. జిల్లావ్యాప్తంగా భద్రతను కట్టు దిట్టం చేశారు. శుక్రవారం దాడి ఘటనకు బాధ్యులను చేస్తూ పటియాలా రేంజ్ ఐజీపీ, పటియాలా సీనియర్ ఎస్పీ, ఎస్పీలను బదిలీ చేశారు.