పాస్టర్ల దాష్టీకాలు..

పాస్టర్ల దాష్టీకాలు..

తెలంగాణాలో హిందూ మహిళపై పాస్టర్ దాడి చేసిన ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో మరో పాస్టర్ యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది.తిరుపతికి చెందిన ఓ చర్చి పాస్టర్ దేవసహాయం రెయిన్‌బో కెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీలో పట్టణంలోని చింతలచేను ప్రాంతానికి చెందిన యువతి(20) గత నెలలో పనిలో చేరింది. ఆమెపై కన్నేసిన పాస్టర్ దేవసహాయం తరచూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. కోరిక తీర్చమంటూ ఒత్తిడి చేసేవాడు.అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 3వ తేదీ సాయంత్రి రేణిగుంట మండలం గాజులమాండ్యం గ్రామంలో కంపెనీ ఉత్పత్తులు డెలివరీ ఇవ్వాల్సి ఉందంటూ యువతిని వ్యానులో ఎక్కించుకుని వెళ్లాడు. రేణిగుంట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా కొట్టి, గాయపరిచి అమానుషంగా రేప్ చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు.బాధితురాల తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గాజులమాండ్యం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె 12వ తేదీన స్పందనలో తిరుపతి ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏఎస్పీ ఆదేశించడంతో గాజులమాండ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తిరుపతి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.కొద్ది రోజులుగా ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో పాటు మత మార్పిడుల ఘటనలు,హిందూ ఆలయాలపై దాడుల ఘటనలతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos