న్యూ ఢిల్లీ : పెగసస్ పై ఉభయ సభల్లోనూ సోమవారం విపక్షాల ఆందోళన కొనసాగడం వల్ల పార్లమెంటు మళ్లీ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్తోపాటు ఇతర వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీ లేక సభాపతులు సభను వాయిదా వేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటులో విపక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ చర్చించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రి వీరేంద్ర కుమార్ ప్రవేశపెట్టనున్నారు.