హైదరాబాద్ : తెరాస పార్లమెంటీ పార్టీ నాయకుడుగా కే. కేశవరావును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. ఆయన రాజ్యసభలో కూడా పార్టీ పక్ష నాయకుడుగా వ్యవహరిస్తారు. లోక్సభలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ పక్ష నేతగా వ్యవహరిస్తారు. గురువారం ఇక్కడ జరిగిన తెరాస పార్లమెంటరీ సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు, అనుభవం, విధేయతను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిసింది. కేశవరావును పార్లమెంటరీ పక్ష నేతగా కొనసాగించగా, నామా నాగేశ్వర రావు లోక్సభలో గతంలో తెదేపా పక్ష నేతగా వ్యవహరించిన అనుభవం ఉన్నందున ఈసారి ఆయనకు అవకాశం దక్కింది. కాగా లోక్సభ, రాజ్యసభల్లో ఒక్కో ఉప నేత, ఒక్కో విప్ను నియమించాలని నిర్ణయించారు.