ముంబై : టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్కు దూరమయ్యాడు. వెన్నులో గాయం కారణంగా పాండ్యా ఈ సిరీస్ ఆడడం లేదని బీసీసీఐ తెలిపింది. వచ్చే వారం నుంచి అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందే అవకాశాలున్నాయని పేర్కొంది. పాండ్యా స్థానంలో అయిదు వన్డేలకు గాను రవీంద్ర జడేజాను తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న సిరీస్లో ఆసీస్ రెండు టీ20 మ్యాచ్లు, అయిదు వన్డేలు ఆడనుంది.