భారత్‌లో దాడులకు పాక్ కుట్ర

భారత్‌లో దాడులకు పాక్ కుట్ర

ఢిల్లీ : భారత్‌లో దాడులు చేయించేందుకు పాకిస్తాన్ పథక రచన చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్ విషయంలో అమెరికా సహా అనేక దేశాలు పాకిస్తాన్ వాదనలను పట్టించుకోకపోవడంతో ఉగ్ర దాడులు చేయించాలని పథకం పన్నిందని తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా ఉగ్ర మూకలను దేశంలోకి పంపించడానికి సమాయత్తమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జమాత్ ఇస్లామిక్ సంస్థతో కలసి ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తోందని వెల్లడించాయి. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. భారత్‌లో దాడులకు గత నెల రెండో వారం నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos