ఇస్లామాబాద్: కశ్మీర్ వాసులు సాగించే పోరాటాలకు అండగా నిలుస్తామని పాక్ ప్రకటించింది. జమ్ము- కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దైన నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా ఆర్మీ అధి కారులతో ఉన్నతస్థాయి మంగళవారం ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై పదాతి దళ అధికార ప్రతినిథి జనరల్ గఫూర్ ట్వీట్ చేశారు. ‘ఈ పోరాటంలో కశ్మీరీలకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుంది. మా బాధ్యతలను నిర్వర్తిం చేందుకు ఎంత వరకైనా వెళతామ’ని బజ్వా వ్యాఖ్యానించినట్లు వివరించారు.