భారత్ యువతితో పాక్ క్రికెటర్ పరిణయం

  • In Sports
  • August 21, 2019
  • 149 Views
భారత్ యువతితో పాక్ క్రికెటర్ పరిణయం

దుబాయి : భారత్‌కు చెందిన షామియా అర్జూతో పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హర్యానాకు చెందిన షామియా కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. ఆమె ఎమిరేట్‌ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. దుబాయిలో జరిగిన ఓ విందులో వారిద్దరికీ పరిచయమై, ప్రేమగా మారింది. తర్వాత ఇరు కుటుంబాల సమ్మతితో మంగళవారం వారి వివాహం జరిగింది. హసన్‌ తన వివాహానికి హాజరు కావాల్సిందిగా భారత క్రికెటర్లను ఆహ్వానించినా, ఎవరూ రాలేదు. పాకిస్తాన్‌ క్రికెటర్లలో కూడా షాదాబ్‌ ఖాన్‌ మాత్రమే హాజరయ్యాడు. పాక్‌ క్రికెటర్లు ప్రస్తుతం శిక్షణ శిబిరంలో ఉన్నందున రాలేకపోయారు. భారత్‌ అమ్మాయిలను వివాహమాడిన పాక్‌ క్రికెటర్లలో హసన్‌ నాలుగోవాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos