సమస్యలపై ప్రశ్నిస్తే మోదీ చిరుతను మించిన వేగంతో పారిపోతారు

సమస్యలపై ప్రశ్నిస్తే మోదీ చిరుతను మించిన వేగంతో పారిపోతారు

జైపూర్ : సమస్యలపై ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోదీ చిరుతను మించి వేగంగా పరుగెత్తగలరని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి వచ్చిన చిరుతల నడుమ ప్రధాని మోదీ తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒవైసీ పై విధంగా స్పందించారు. “మీరు ఎప్పుడైనా మోదీని నిరుద్యోగం, లేక భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలపై అడిగి చూడండి. ఆయన చిరుత కంటే వేగంగా పరుగు తీస్తారు. ఆయ నను మేం ఆగమని చెబుతున్నాం. అడిగే ప్రశ్నలకు నిలిచి జవాబు ఇవ్వమంటున్నాం. భారత భూ భాగంపై చైనా ఎలా దురాక్రమణలకు పాల్పడుతోందో చెప్పమం టు న్నాం” అని వ్యాఖ్యానించారు. హాస్యం కూడా రాజకీయాల్లో భాగమేనని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారని, అందుకే ఆయనపై చిరుతపులి వ్యాఖ్యలు సరదాగా చేశానని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos