ఒవైసీకి జడ్ కేటగిరి భద్రత.

ఒవైసీకి జడ్ కేటగిరి భద్రత.

న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేంద్రం సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించింది. నిన్నటి కాల్పుల ఘటన ఇందుకు కారణం. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. ఆరుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు, పోలీసులతో సహా 22మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఎస్కార్టు కారుతోపాటు ఢిల్లీ పోలీసులు, ఐటీ బీపీ, సీఆర్పిఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు. తాను ఎప్పుడూ భద్రతను కోరుకోలేదని, ఎందుకంటే తన ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఒవైసీ నొక్కి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos