టీ20 మ్యాచ్‌పై మండిప‌డ్డ అస‌దుద్దీన్ ఒవైసీ

టీ20 మ్యాచ్‌పై మండిప‌డ్డ అస‌దుద్దీన్ ఒవైసీ

హైదరాబాదు: టి 20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పోటీ కి అనుమతించినందుకు ఎంఐఎం అధినేత నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో తొమ్మిది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసారు. ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెలరేగి పోతోన్న ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్తో భారత్ ఆడుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్ర సర్కారు విఫలమైందని విమర్శించారు. చైనాను ఎదుర్కోవడంలోనూ మోదీ సర్కారు సమర్థంగా పని చేయట్లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకి రూ.100 దాటినా , సరిహద్దుల్లో చైనా కూడా మన భూభాగంలోకి ప్రవేశించినా ప్రధాని మోదీ స్పందించడం లేదని విమర్శించారు. మన భూభాగాల్లోకి చైనా సైనికులు దూసుకువస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఎద్దేవా చేసారు.

తాజా సమాచారం