అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందిలో అవసరానికి మించి ఉన్న 42 మందిని సేవల నుంచి తొలగిస్తూ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. జగన్ ముఖ్య మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కీలక స్థానంలోని అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసు డైరెక్టర్ ఆర్.పి. ఠాకూర్ స్థానంలో నిఘా విభాగం డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ను నియ మించింది. ముఖ్యమంత్రి కార్యాలయపు అదనపు కార్యదర్శిగా ధనంజయ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శిగా సోల్మన్ ఆరోఖ్యరాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రావత్, ప్రత్యేక అధికారిగా కృష్ణ మోహన్ రెడ్డిని నియమించింది.