రాజమండ్రి: అయినవిల్లి మండలం మడుపల్లిలో శుక్రవారం ఒఎన్జిసి క్షేత్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు చమురు ట్యాంకర్లు దగ్థమయ్యాయి. దీంతో సమీప గ్రామస్తులు భయబ్రాంతులకు గుర య్యారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ‘ఒఎన్ జిసి అధికారులు కనీస జాగ్రత్తలు పాటించలేదు. పరీక్షల పేరిట గత వారం నుంచి భారీ శబ్దంతో వాయువు విడుదల చేస్తున్నారు. సమీప గ్రామాలవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేద’ని స్థానికులు విమర్శించారు.