ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల అపహరణ

ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల అపహరణ

గౌహతి : అసోం – నాగాలాండ్ సరిహద్దులోని శివసాగర్ జిల్లా లక్వా ఓ ఎన్జీసీ కేంద్రం వద్ద బుధవారం తెల్లవారు జామున ముగ్గురు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. ఉల్ఫా – ఉగ్ర సంస్థ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. జూనియర్ టెక్నీషియన్లు ఎమ్ ఎమ్ గొగొయి, రితుల్ సైక్యా, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అలకేశ్ సైక్యా అపహరణ పాలయ్యారని ఓన్జీసీ ప్రతినిధి తెలిపారు. ఓన్జీసీ వాహనంలోనే సిబ్బందిని అపహరించిన ఆ వాహనాన్ని అసోం-నాగాలాండ్ సరిహద్దులోని నిమో నగఢ్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. అపహరణ కారులు ఇప్పటి వరకూ ఏ విధమైన డిమాండ్లు చేయలేదని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos