జేసీపై మరో కేసు

జేసీపై మరో కేసు

అనంతపురం : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై పలు కేసులున్నాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీపై తాజాగా తాడిపత్రి పీఎస్‌లో కేసు నమోదయ్యింది. జేసీ ప్రభాకర్రెడ్డి, తనయుడు అస్మిత్‌ రెడ్డితో పాటు 32 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్న జేసీ సోమవారం తాడిపత్రికి చేరుకున్నారు. భారీ ర్యాలీతో కార్యకర్తలు, అనుచరులు ఆయనకు స్వాగతం పలికారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఇలా చేయకూడదని, ఇది నిబంధనలు ఉల్లంఘించినట్లేనని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జేసీ బ్రదర్స్ కానీ.. అస్మిత్ రెడ్డి కానీ స్పందించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos