శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్ కుల్గాం జిల్లా లోయర్ ముందా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. ఉగ్రవాదుల కోసం అక్కడ కేంద్ర పారామిలటరీ జవాన్లు గాలింపు చేసినపుడు ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు.దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. దరిమిలా ఒక ఉగ్రవాది మరణించాడని పోలీసు వర్గాలు ఇక్కడ తెలిపాయి.