ఒమన్‌ జట్టుకు పరాభవం

  • In Sports
  • February 19, 2019
  • 174 Views
ఒమన్‌ జట్టుకు  పరాభవం

అల్ అమరాట్: స్కాట్లాండ్‌తో మంగళవారం
జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్‌ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. ఇందులో ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్‌ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరితే, మిగతా ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఖవర్‌ అలీ(15) ఒక్కడే రెండంకెల స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో రుద్రి స్మిత్‌, ఆడ్రియన్‌ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లు
పడగొట్టారు. స్కాట్లాండ్‌ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో
లక్ష్యాన్ని ఛేదించింది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్‌ పేరిట ఉంది.
2007లో బార్బోడాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ అండర్‌-19 జట్టు 18 పరుగులకే ఆలౌటైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos