‘ఆపరేషన్ లోటస్’కే ఆపరేషన్

‘ఆపరేషన్ లోటస్’కే ఆపరేషన్

ముంబయి : విపక్ష ప్రభుత్వాలను కూలదోస్తున్న భాజపా రాజస్థాన్ వైఫల్యంతో గుణ పాఠం నేర్చుకోవాలని శివసేన పత్రిక -సామ్నా హితవు పలికింది. ‘ఆపరేషన్ లోటస్’కే ఆపరేషన్ చేసి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్ భాజపా నాయకత్వానికి మంచి గుణపాఠం నేర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటే మంచిది. కరోనా విజృంభిస్తోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఆర్థిక వ్యవస్థ గందరగోళ పరిస్థితుల్లో ఉంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం విపక్ష ప్రభుత్వాలను పడగొట్టడంలో బిజీగా ఉంది. ఇది రాజకీయ మానసిక అనారోగ్యానికి సంకేతం కాదా? . తొలుత కేంద్రం ఆ అనారోగ్యం నుండి బయటపడాల’ని సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos