హొసూరు : ఇక్కడి రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో 60 ఏళ్ల అపరిచిత వ్యక్తి రైలు కింద పడి శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూరు నుంచి ముంబైకి వెళ్లే కుర్లా ఎక్స్ప్రెస్ స్థానిక రైల్వే స్టేషన్లో ఆగింది. పది నిమిషాల తర్వాత బెంగళూరుకు బయలుదేరింది. ఓ వృద్ధుడు పట్టాలపై తలపెట్టి పడుకున్న దృశ్యాన్ని చూసిన డ్రైవర్ రైలును ఆపడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. రైలు దూసుకెళ్లడంతో తల ఓ చోట, మొండెం మరో చోట పడ్డాయి. రైలు డ్రైవర్ హొసూరు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని హొసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధుని పూర్వాపరాలు తెలుసుకోవడానికి రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.