ఇరాన్‌ ట్యాంకర్‌పై దాడి

ఇరాన్‌ ట్యాంకర్‌పై దాడి

టెహ్రాన్: నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి చెందిన చమురు ట్యాంకర్ను తీసుకెళుతున్న ఓడపై జెద్దా తీరంలో రెండు క్షిపణులు దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక టీవీ శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. ట్యాంకర్ పేలి పోవటంతో చమురు ఎర్ర సముద్రంలోకి ప్రవహించింది. కాసేపటికి చమురు ప్రవహించ కుండా చర్యల్ని తీసుకున్నారు. ఓడలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారు. . దీనిపై సౌదీ అరేబియా ఇంకా స్పందించాల్సి ఉంది. గత నెల్లో సౌదీ అరేబియాలోని రెండు చమురు క్షేత్రాలపై హుతీ తిరుగుబాటు దారులు దాడి చేసారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ దాడుల్ని తామే చేసినట్లు ఎమెన్ ప్రకటించినా సౌదీ మాత్రం ఇరాన్ పట్లే ఆగ్రహంగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos