ఎన్టీఆర్ బయోపిక్లు రెండు భాగాలు ఘోరంగా పరాజయమవడంతో నందమూరి అభిమానులు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు.బాలకృష్ణ స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు,మహానాయకుడు రెండు సినిమాలు ఘోర పరభవాన్ని మూటగట్టుకున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో కథనాయకుడు అంతోఇంతో వసూళ్లు రాబట్టిన కొద్ది రోజుల క్రితం విడుదలైన మహానాయకుడు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.మొదటిరోజే అత్యంత దారుణమైన వసూళ్లు రాబట్టిన మహానాయకుడు రెండవ రోజే నెగిటివ్ షేర్స్ రాబట్టుకునే స్థితికి దిగజారింది.సినిమాను ఇంతటితో వదిలేసి ఉంటే కొంచమైన ఉత్తమంగా ఉండేదేమో.ఎవరు సూచించారో కానీ మహానాయకుడి సినిమాకు టికెట్లు ఫ్రీగా పంపిణీ చేయాలంటూ ఆదేశాలు రావడంతో ఈ వ్యవహారం ఎన్టీఆర్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేస్తోంది.చాలా చోట్ల మహానాయకుడు థియేటర్లను ఫీడ్ చేసే బాద్యతను టిడిపి పార్టీ తీసుకోవడంతో ఉచితంగా టికెట్లు ఇస్తున్న ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లా అద్యక్షులు పంపించినట్టుగా వచ్చిన వాట్స్ అప్ మెసేజులు ఫ్రీషోల గురించి స్థానిక ఎమెల్యేలు చేసిన ఫ్లెక్సీల ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేసాయి.ఇప్పుడు తాజాగా డ్వాక్రా మహిళలకు ఫ్రీషోలు వేయమని ఆదేశాలు వచ్చాయట. ఆ ఖర్చులన్నీ స్థానిక టిడిపి క్యాడర్ భరిస్తుంది. ఎగ్జిబిటర్ కు టికెట్ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి నో చెప్పడానికి లేదు.ఒకప్పుడు బళ్ళు కట్టుకుని బ్లాక్ లో టికెట్లు కొని కుటుంబ సమేతంగా తన సినిమాలకు జనం వచ్చేలా చేసుకున్న ఎన్టీఆర్ కథను తెరమీద ఇలా ఉచితంగా లాక్కెళ్ళి బలవంతంగా చూపించాల్సిన దుస్థితి ఎంటనేది ఎన్టీఆర్ అభిమానుల వాదన..