అమరావతి: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయానికి విచారిస్తున్నట్లు శాసన సభాపతి తమ్మినేని సీతారాం మంగళ వారం సభలో పేర్కొన్నారు.‘ఆ పాపంలో నేను కూడా ఉన్నా. పశ్చాత్తాప పడుతున్నా. పాపంలో భాగస్వామి నైనందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నాన’న్నారు. సభాపతిగా తనకున్న విచక్షణాధికారంతోనే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లా డేందుకు వల్లభనేని వంశీకి అవకాశమిచ్చానని చెప్పారు. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి ఓ సభ్యుడితో మాట్లాడించారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆక్షేపించి నందుకు ఆ మేరకు స్పందించారు. ‘శాసనసభను వైకాపా కార్యాలయంగా మార్చి న ట్లు తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదు. శాసనసభ ఎవరి జాగీరూ కాదు. ప్రజల జాగీర’ని తెలిపారు.