అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పౌర పట్టిక

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పౌర పట్టిక

న్యూఢిల్లీ: కేంద్రం తన పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పౌర పట్టిక తదితరాల్ని తెర పైకి తెచ్చిందని రాజ్య సభలో కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ దేశంలోని 50 నుంచి 60 కోట్ల మంది ప్రజలకు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీలు తెలియవు.నూతన పౌరసత్వ చట్టం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఎన్పీఆర్ తర్వాత ఎన్ఆర్సీ వస్తుందని చెప్పారు. గతంలోనూ ఎన్పీఆర్ నిర్వహించారు. అప్పుడు ప్రశ్నలు సహజంగా ఉండేవి. భాజపా మాత్రం ఇప్పుడు తప్పు డు పద్ధతిలో ఎన్పీఆర్ను తీసుకొస్తోంది. ‘హిందువా, ముస్లిమా అనే గుర్తింపుతో ఎన్పీఆర్కు సంబంధం లేదని మేము నమ్ము తున్నాం.ఈ దేశంలోని 50 నుంచి 60 కోట్ల మంది ప్రజలకు వాళ్ల తల్లిదండ్రుల పుట్టిన తేదీలు తెలియవ’న్నారు. ఇచ్చిన హామీలను నిలుపుకోలేకనే భాజ పా ప్రభుత్వం ఇలాంటి సమస్యల్లోకి జనాలను లాగుతోందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos