అమరావతి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున క్రమ శిక్షణా చర్యల్ని ఎందుకు తీసుకోరాదని వైకాపా నాయకత్వం బుధవారం నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు సంజాయిషీ తాఖీదుల్ని జారీ చేసింది. వారంలోగా బదులివ్వాలని సూచించింది. రఘు రామ కృష్ణం రాజు వైకాపీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా బహిరంగ ఆరోపణలు చేసారు. వివిధ అంశాల్లో తెదేపా, భాజపాలకు మద్దతుగా నిలిచారు. తెదేపా త అచ్చన్నాయుడు అరెస్ట్ను ఖండించారు.